• Login / Register
  • India - ATMs Closed | దేశ వ్యాప్తంగా 4000 ఏటీఎంలు మూత‌

    India - ATMs Closed | దేశ వ్యాప్తంగా 4000 ఏటీఎంలు మూత‌
    గ‌త 12 నెల‌ల్లోనే మూడ ప‌డిన ఏటీఎంలు
    రిజ‌ర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా వెల్ల‌డి
    Hyderabad : దేశ వ్యాప్తంగా నగదు చలామణి రికార్డు స్థాయికి పెరుగుతుంది. అయిన‌ప్ప‌టికీ  స్వ‌దేశీయ బ్యాంకులు మాత్రం తమ ఏటీఎం నెట్‌వర్క్‌లను క్ర‌మంగా తగ్గిస్తున్నాయి. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో గత 12 నెలల్లోనే ఏకంగా 4 వేల ఏటీఎంలు శాశ్వ‌తంగా మూతపడ్డాయి. దేశంలో డిజిటల్‌ చెల్లింపులు రోజు రోజుకు పెరుగుతున్నాయ‌ని, ఇదీ ఒక కారణమ‌ని చెప్పుతున్నారు గ‌త ఏడాది సెప్టెంబర్‌లో దేశవ్యాప్తంగా 2.19 లక్షల ఏటీఎంలు ఉండగా ఈ ఏడాది వాటి సంఖ్య 2.15 లక్షలకు తగ్గినట్టు Reserve Bank Of India (RBI) రిజర్వు బ్యాంకు వెల్లడించింది. డిజిటల్‌ చెల్లింపులకు ఆదరణ పెరుగుతున్న త‌రుణంలో బ్యాంకులు సంప్రదాయ ఏటీఎంలపై ఫోకస్‌ తగ్గించి, యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) వంటి డిజిటల్‌ మౌలిక వసతుల మెరుగుదల పై  ఫోక‌స్ పెట్టాయి. ఫిజిక‌ల్‌, డిజిటల్‌ మౌలిక వసతులను ఏకీకృతం చేయడం ద్వారా బ్యాంకులు తమ నెట్‌వర్క్‌ను సైతం తగ్గిస్తున్నాయని, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఈ విధానం అధికంగా ఉన్నదని ఏజీఎస్‌ ట్రాన్సాక్ట్‌ టెక్నాలజీస్‌ సంస్థ చైర్మన్‌ రవి బీ గోయల్ ఒక మీడియా సంస్థ‌తో అన్నారు. ఇప్పటికే దేశంలో చాలా ఏటీఎంలు మూతపడటంతో ప్రస్తుతం ప్రతి లక్ష మంది ప్రజలకు 15 చొప్పున ఏటీఎంలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో నగదు వినియోగానికి, ఏటీఎంల లభ్యతకు మధ్య తీవ్ర అసమతుల్యత కొనసాగుతున్నద‌ని చెప్ప‌వ‌చ్చు.
    *  *  * 

    Leave A Comment